పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు

72பார்த்தது
కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారుపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారం మేరకు కోటపల్లి ఎస్సై రాజేందర్ సిబ్బందితో వెళ్లి దాడి చేయగా నలుగురు వ్యక్తులు పట్టుబడగా, మరో నలుగురు పారిపోయారు. పట్టుబడిన వారి నుండి రూ. 1, 34, 750 నగదు, మూడు సెల్ ఫోన్స్, పేక ముక్కలు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி