అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

71பார்த்தது
చెన్నూర్ మండల్ అస్నాద్ గ్రామంలో సోమవారం ప్రమాదశాత్తు గ్యాస్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమైన బాధిత కుటుంబాలను సోమవారం రాత్రి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తక్షణ సహాయం కింద రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி