పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

51பார்த்தது
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరాగడిలో పేకాట స్థావరంపై సోమవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. చెట్లపొదల్లో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 21, 450 నగదు, , ఆరు మొబైల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్‌ఐలు ఉపేందర్, లచ్చన్న, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி