పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్, బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లు కాపాడుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి కోరారు. మంగళవారం చెన్నూర్ లో జరిగిన సీపీఎం మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల పాలనలో బిజెపి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు.