నక్కలపల్లి వాగుపై వంతెన నిర్మించాలి

68பார்த்தது
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కోటపల్లి మండలంలోని నక్కలపల్లి వంతెనను శనివారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రోజుల క్రితం వాగును పరిశీలించి బ్రిడ్జికి మరమ్మతులు చేయిస్తానని స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி