కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అమలవుతున్న పథకాలు

84பார்த்தது
కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అమలవుతున్న పథకాలు
తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్ గ్రామపంచాయతీలో మహాలక్ష్మి పథకం హామీ పత్రాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. పేద ప్రజలపై ఆర్థిక భారం పడవద్దని, కేవలం రూ 500 కి ఎల్పీజీ సిలిండర్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. పంచాయతీ కార్యదర్శి సౌందర్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி