శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: తాండూర్ ఎస్ఐ

73பார்த்தது
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి: తాండూర్ ఎస్ఐ
తాండూర్ మండల ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, మతసామరస్యానికి ప్రతీకగా నిలవాలని, కుటుంబ సభ్యులతో అందరూ కలిసిమెలిసి సంతోషంగా విజయదశమి పండుగ జరుపుకోవాలని ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు. దసరా పండగ సందర్బంగా ఆయుధపూజ, వాహనాల పూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామని, ఎప్పటికైనా మంచి మార్గమే విజయానికి సోపానం అవుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி