బొగ్గు బ్లాకులను సింగరేణి కేటాయించాలని ధర్నా

75பார்த்தது
బొగ్గు బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని ఐఎన్టియూసి బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி