రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు బెల్లంపల్లి విద్యార్థులు ఎంపిక

59பார்த்தது
రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు బెల్లంపల్లి విద్యార్థులు ఎంపిక
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సెంట్రల్ ఆఫ్ ఎక్సెలెన్సీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ దూట శ్రీధర్ తెలిపారు. మందమర్రి పట్టణంలో ఈనెల 4న ఉమ్మడి ఆదిలాబాద్ జోనల్ స్థాయిలో జరిగిన పోటీల్లో ఇంటర్ ఎంపీసీ విద్యార్థి విశ్వతేజ్, అరవింద్ ఎంపికయ్యాడు. వీరిని ఎస్ఎఫ్ కార్యదర్శి బాబురావు, వైస్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, లెక్చరర్లు అభినందించారు.

தொடர்புடைய செய்தி