సంక్షేమ బోర్డు బలోపేతం చేయాలి

68பார்த்தது
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును బలోపేతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడం పట్ల సోమవారం మరికల్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం సరైంది కాదని, ప్రభుత్వం ఆలోచనలను విరమించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி