మక్తల్: హ్యాండ్ బ్యాగును అప్పగించిన పోలీసులు

65பார்த்தது
మక్తల్: హ్యాండ్ బ్యాగును అప్పగించిన పోలీసులు
ముంబైకి చెందిన శోభమ్మ పసుపుల దత్తాత్రేయ స్వామి దర్శనం కొరకు గురువారం మక్తల్ బస్టాండ్ నుండి ఆటోలో బయలుదేరి వెళ్లింది. కాగా తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్టాండులో మర్చిపోయింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బ్యాగును గుడిగండ్లకు చెందిన ఆశప్ప వద్ద వుందని తెలుసుకున్నారు. వెంటనే పోలీసులు బ్యాగును మహిళకు అందించారు. ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி