శిథిలావస్థలో వున్న గృహాల కూల్చివేత

56பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలక పరిధిలోని 11వ వార్డులో పాడుబడిన, శిథిలావస్థకు వున్న ఇళ్లను, నివాస గృహాలను మంగళవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జ్యోతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ. శిథిలావస్థకు చేరుకున్న నివాస గృహాల యజమానులతో మాట్లాడి సామరస్యంగా కూల్చివేతలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు పాడుబడిన ఇండ్లలో ఉండకూడదన్నారు. వర్షాల మూలంగా ప్రమాదాలు జరగవచ్చని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు.

தொடர்புடைய செய்தி