బైక్ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి

52பார்த்தது
బైక్ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫరూక్ నగర్ మండలం వెలిజెర్ల గ్రామానికి చెందిన మహిళ మృతి చెందినట్లు సమాచారం. మోటార్ సైకిల్ పై వెళుతుండగా లారీ ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி