తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

64பார்த்தது
తుంగభద్ర నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం లోని కేశవరం గ్రామ సమీపంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున ఆదివారం గుర్తు తెలియని శవం లభ్యమయింది. నది పై భాగాన ఉన్న కర్ణాటక నుంచి శవం కొట్టికొచ్చిందా, లేక ఈ ప్రాంతానికి చెందిన వారిదేనా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అయిజ ఎస్ఐ విజయభాస్కర్ శవ పరీక్ష చేయించి, అంత్యక్రియలు నిర్వహించామన్నారు.

தொடர்புடைய செய்தி