మట్కా ఆడుతున్న ముగ్గురి అరెస్ట్

55பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చ్ ప్రాంగణంలో గురువారం మట్కా ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్టు టూ టౌన్ సిఐ ఐజాజుద్దీన్ తెలిపారు. వారి వద్ద నుంచి దాదాపు రూ. 14370 స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రజలు ఎవరు కూడా మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி