ఆర్టీసీ బస్సు-బైక్‌ ఢీ.. ఇద్దరికి గాయాలు

585பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజమూరు గ్రామ పరిధిలోని గండి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూల మలుపులో ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన పకీరప్పతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி