ఎమ్మెల్యే జియంఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

62பார்த்தது
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే తండ్రి కృష్ణారెడ్డి మృతి చెందిన నేపథ్యంలో 11 రోజుల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చిన్న చింతకుంట మండలం, దమగ్నాపూర్ కు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకున్నారు. జి. కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி