ఏపీకి త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తా: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

75பார்த்தது
ఏపీకి త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తా: శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌
ఏపీలో వరద గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. గురువారం గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రి ఏరియల్‌ సర్వే ద్వారా బుడమేరు, విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజలు ఐదు రోజుల పాటు వరదనీటిలో ఉండిపోయారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం ఎంతో కృషి చేశారు. సహాయక కార్యక్రమాలు బాగా చేశారు. ఏపీకి త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తా’’అని చెప్పారు.

தொடர்புடைய செய்தி