బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు లీగల్ నోటీసులు

73பார்த்தது
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు లీగల్ నోటీసులు
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు మెయిన్‌ హర్డ్స్‌ సంస్థ లీగల్‌ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంది. దురుద్దేశంతో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఆరోపణలు చేశారని తెలిపింది. క్రిశాంక్‌ తన వ్యాఖ్యలను 24 గంటల్లోపు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, ఎక్స్‌లో పెట్టిన పోస్టులను తొలగించాలని డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி