ఆస్కార్‌ పోటీలకు ఎంపికైన 'లాపతా లేడీస్'

62பார்த்தது
ఆస్కార్‌ పోటీలకు ఎంపికైన 'లాపతా లేడీస్'
ఆస్కార్-2025కు భారత్ నుంచి 'లాపతా లేడీస్' చిత్రం అధికారికంగా ఎంపికైంది. కల్కి 2898 AD, యానిమల్, ఆట్టమ్ వంటి చిత్రాలతో పోటీ పడి ఈ అవకాశాన్ని 'లాపతా లేడీస్' దక్కించుకుంది. జాహ్ను బారువా నేతృత్వంలోని కమిటీ ఈ సినిమాను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. అమీర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

தொடர்புடைய செய்தி