40 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేసిన చర్ల పోలీస్ అధికారులు

57பார்த்தது
40 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేసిన చర్ల పోలీస్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం సీఐ రాజు వర్మ ఆధ్వర్యంలో కొరకట్ పాడు గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఈ గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే 40 కుటుంబాలకు దోమతెరలను పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி