ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అందేలా చూస్తామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామిరెడ్డి అన్నారు. చంద్రుగొండలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారుల నివాస గృహాలకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామని, త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.