ఆటో కార్మికులు గత నెల రోజులుగా అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెల్తామని డిసిఎంఎస్ వైస్ చైర్మన్, జిల్లా
కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఆటో కార్మికుల సమస్యలపై పాల్వంచ దమ్మపేట సెంటర్ లోని శ్రీ శ్రీనివాస ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. దమ్మపేట నుండి పాత పాల్వంచలోని కొత్వాల ఇంటి వరకు ప్రదర్శనగా వెళ్లి ఆయనకు వినతి పత్రం సమర్పించారు.