చండ్రుగొండ మండల పరిధిలోని మద్దుకూరులో వ్యవసాయ మోటార్కు విద్యుత్ సరఫరా అయ్యే వైర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్టు రైతులు గురువారం గుర్తించారు. మండల వ్యాప్తంగా గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. తరచూ ఇలాంటి దొంగతనాలతో రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.