కొమురంభీం జిల్లా పెంచికల్పేట్ మండలం ఎలుక పెళ్లి గ్రామంలో విద్యుత్ దీపాలు పగలే వెన్నెలలాగా మెరుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం దాటినా స్థంభాలకు ఉన్న దీపాలు వెలుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని, గ్రామ కార్యదర్శికి పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా వృధా కాకుండా చూడాలని కోరుతున్నారు.