కాగజ్నగర్ పట్టణం కాపు వాడలోని ఎమ్మెల్సీ నివాసంలో శనివారం ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో హనుమాన్ మహా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ఆంజనేయ స్వామి భక్తులు పెద్ద ఎత్తున హాజరై హనుమాన్ శత అష్టోత్తర నామావళి పూజ చేశారు. అనంతరం స్వాములతో కలసి భీక్ష చేసి వారికి తాంబూలం సమర్పించారు. ఎమ్మెల్సీ దండే విటల్ మాట్లాడుతూ సనాతన హైందవ హిందూ సంప్రదాయాలు కాపాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు.