బాధితురాలికి నిత్యావసర సరకుల వితరణ

76பார்த்தது
బాధితురాలికి నిత్యావసర సరకుల వితరణ
ఇటీవలి వర్షాలకు పెంచికల్పేట్ మండలం బొంబాయిగూడలోని అంకుబాయి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. విషయం తెలుసుకున్న పెంచికల్పేట్ ఎస్ఐ కొమురయ్య సోమవారం ఆ ఇంటిని పరిశీలించి బాధితురాలికి రూ. 2000 లతో పాటు 40 కిలోల బియ్యం, దుప్పట్లు వితరణ చేశారు. ఏఎస్ఐ ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ సారయ్య, సామాజిక కార్యకర్త ప్రకాశ్, నాయకుడు గుండయ్య, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி