రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ఆందోళన

75பார்த்தது
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి గ్రామంలో యువకులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దుర్గాదేవికి సంబంధించిన డబ్బులను కోట శంకర్ అనే వ్యక్తి వాడుకున్నట్లు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. నవరాత్రి ఉత్సవాలకు డబ్బులు అవసరం కావడంతో అడగడానికి వెళ్లిన యువకులపై శంకర్ దాడి చేశాడని యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అతడిని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி