వర్షాకాలంలో అంటూ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కొమురంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం కాగజ్నగర్ మండలం భట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారితో ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రిలోని వార్డులు, ఫార్మసీ, రిజిస్టర్లు పరిశీలించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.