అసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గర్ల్స్ హైస్కూల్ లో శుక్రవారం విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే కాగజ్నగర్ పట్టణంలోని విశ్వశాంతి హైస్కూల్లో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సభ్యులు స్వప్న, రమాదేవిలు మాట్లాడుతూ, మహిళలు హింస, ఈవ్టీజింగ్, సైబర్ క్రైమ్ లకు గురైనట్లయితే వెంటనే షీటీం ను సంప్రదించాలని సూచించారు.