తనిఖీల్లో 1లక్ష 96 వేలు పట్టుకున్న జైనూర్ ఎస్ఐ

1915பார்த்தது
తనిఖీల్లో 1లక్ష 96 వేలు పట్టుకున్న జైనూర్ ఎస్ఐ
వాహనాల తనిఖీల్లో రూ. 1 లక్ష 96వేలు పట్టుకున్నట్లు జైనూర్ ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. లోకసభ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో గురువారం కొమురంభీం జిల్లా జైనూర్ మండలంలోని జంగావ్ సమీపంలో జైనూర్ ఎస్ఐ సందీప్ కుమార్, ఏఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తణిఖీలు చేపట్టారు. తనిఖీలో ముగ్గురు వేరువేరు వ్యక్తుల వద్ద లభించిన డబ్బులకు సరైన ఆధారాలు చూపని కారణంగా సీజ్ చేసి ఫ్లయింగ్ స్కాడ్ కు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி