ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

74பார்த்தது
ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తికి గాయాలు
కారేపల్లి మండలంలోని చీమలపాడు రోడ్డు మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ఘటనలో మాధారం మైన్ హోంగార్డుకు గాయాలయ్యాయి. ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన చందర్ మండలంలోని మాధారం డోలమైట్ మైన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విధులకు హాజరైయ్యేందుకు మాధారం నుంచి చీమలవారి గూడెం మీదుగా ఖమ్మం వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి పడిపోవటంతో తలకు తీవ్ర గాయమైంది.

தொடர்புடைய செய்தி