రుణాలు ఇవ్వడంలో లేని నిబంధన ఇప్పుడు ఎందుకు?

63பார்த்தது
రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేసేటప్పుడు లేని నిబంధనలు మాఫీలో విధించడం వల్ల 70శాతం రుణమాఫీ కావడం లేదని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ అన్నారు. శుక్రవారం కల్లూరు మండలం ఖాన్ పేట రైతు వేదిక ఎదుట నిరసన తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు నిబంధనలు తొలగించి పహాణి నకళ్ళు ద్వారా రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி