తహశీల్దార్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతల ధర్నా

63பார்த்தது
తల్లాడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు మండల తహసీల్దార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ. రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం షరతులు లేకుండా రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంఘసాని శ్రీను ఉన్నారు.

தொடர்புடைய செய்தி