కోతులతో ఇబ్బంది పడుతున్న రైతులు

70பார்த்தது
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల తండాలో కోతుల బెడదతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు రైతులు తెలిపారు. పత్తి పంటలను ధ్వంసం చేసి తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నాయని చెప్పారు. బానోతు పవన్ అనే రైతుకు చెందిన పత్తి పంటలో కోతులు మూకుమ్మడిగా దాడి చేసి ధ్వంసం చేశాయి. దీంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంటను ఇలా నాశనం చేయడంతో బాధగా ఉందన్నారు. కోతుల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி