ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేసుకోవాలి: సీఐ

60பார்த்தது
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం చేసుకోవాలి: సీఐ
ముదిగొండ మండలంలో గణనాథుల నిమజ్జనం నదులు, చెరువుల వద్ద ప్రశాంతంగా జరగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం చేసుకోవాలని సీఐ మురళి ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు. ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని, చిన్నారులను అనుమతించొద్దని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி