ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కమిషనర్ షేక్ షఫీ ఉల్లా ఆధ్వర్యంలో శనివారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు గ్రామములో రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి బ్లీచింగ్ చల్లించారు. అనంతరం స్థానిక ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.