కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం

73பார்த்தது
కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం
తెలంగాణ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంత వాసుల నిర్మాణాలు తొలగిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శుక్ర‌వారం మూసీ పరివాహక ప్రాంతాల్లో కిష‌న్ రెడ్డి పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో ఇండ్లు, దుకాణాలు కోల్పోయి నిర్వాసితులుగా మారనున్న బాధిత ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

தொடர்புடைய செய்தி