BRS ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ గన్పార్క్ వద్దకు చేరుకున్నపార్టీ అధినేత కేసీఆర్ క్యాండిల్ ర్యాలీని ప్రారంభించారు. గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి కేటీఆర్తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.