సిరిసిల్లలో బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి 'కాకా' కృషి

59பார்த்தது
సిరిసిల్లలో బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి 'కాకా' కృషి
బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కృషి చేశారని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ పేర్కొన్నారు. గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను సిరిసిల్ల జిల్లా యువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ లో నిర్వహించగా, అదనపు కలెక్టర్ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కాకా చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఉన్నతాధికారులు చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி