శునకాల సంచారంతో భయాందోళనలు

73பார்த்தது
ఇల్లంతకుంటతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో శునకాల విహారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. వివిధ కాలనీల్లో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో కుక్కలు ఎప్పుడు ఎవరిని కాటేస్తాయోనాని బిక్కు బిక్కుమంటున్నారు. కుక్కల బెడదతో ప్రత్యేకించి చిన్నారులను ఒంటరిగా బయటకు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను తొలగించాలని బుధవారం మీడియా ద్వారా కోరారు.

தொடர்புடைய செய்தி