ఈనెల 21న భారత్ బంద్ ను విజయవంతం చేయండి

62பார்த்தது
ఈనెల 21న భారత్ బంద్ ను విజయవంతం చేయండి
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 21న చేపట్టిన భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శంకరపట్నం మాల మహానాడు అధ్యక్షుడు కత్తెరమల్ల కిష్టస్వామి పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు మేరకు చేపట్టిన ఈ శాంతియుత బంద్ కార్యక్రమానికి మండలంలోని వర్తక వ్యాపారులు షాప్ యజమానులు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు తెలపాలని కోరారు.

தொடர்புடைய செய்தி