కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌

56பார்த்தது
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌
HYDలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు. 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌ తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. పిటిషన్‌పై ఏప్రిల్‌ 24న వాదనలు వింటామని HC వెల్లడించింది.

தொடர்புடைய செய்தி