బీఆర్ఎస్ లో మొదలైన చేరికలు

82பார்த்தது
ఎల్లారెడ్డిలో డీలాపడ్తున్న బీఆర్ఎస్లో జోరు నింపేందుకు చేరికలు మొదలెట్టారు. ఎల్లారెడ్డి మండలం మత్తమాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి 30మంది కార్యకర్తలు బుధవారం ఎల్లారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.

தொடர்புடைய செய்தி