మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ రాబోతుందా..?

78பார்த்தது
మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ రాబోతుందా..?
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తాజాగా వెల్లడించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. త్వ‌ర‌లోనే రాజ‌కీయ పార్టీ పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలంటూ తనను అందరూ కోరుతున్నారన్నారు. పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయం. పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నాను. ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అంతేకాకుండా వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

தொடர்புடைய செய்தி