ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్ హాకీ జట్టు

65பார்த்தது
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2024లో భారత్ హాకీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సోమవారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు 4-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. భారత్‌ తరుపున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్ చేశాడు. ఉత్తమ్‌ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్ ఒక్కో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని పెంచారు. ఇక సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌లో ఆతిథ్య చైనాతో భారత్ తలపడనుంది.

தொடர்புடைய செய்தி