ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఈ టోర్నీలో పాల్గొననున్న అన్ని దేశాల జాతీయ జెండాలను కరాచీ స్టేడియంలో ప్రదర్శించారు. అయితే అందులో
భారత్ జెండా కనిపించకపోవడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై పీసీబీ క్లారిటీ ఇచ్చింది. భారత జట్టు పాకిస్థాన్లో మ్యాచులు ఆడటం లేదని, ఇక్కడి మైదానాల్లో ఆడే జట్ల జెండాలు ఎగురవేసినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.