నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో శనివారం రోజున శ్రీ వాసవి సేవక్ కమిటీ సభ్యులు పర్యావరణాన్ని రక్షించాలని సదుద్దేశంతో చెట్లను నాటారు. అందరు కూడా ఇలా చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.