ఆషాఢ మాసం బోనాల పండుగను పరిస్కరించుకొని ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ రాంనగర్లోని తన నివాసంలో బోనాల వేడుకలను నిర్వహించారు. వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.