దివ్యాంగ విద్యార్థులు ఉపకరణాల నిర్ధారణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈవో విజయకుమారి అన్నారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షణ, భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మల్కాజిగిరి జడ్పీహెబ్బాలుర పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం 128 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఎంఈవో శశి డర్, శ్రీకాంతాచారి, లత, జగదీష్ పాల్గొన్నారు.